టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు కొదవేమి లేదు. అందులోనూ ఇటీవల కాలంలో మల్టీస్టారర్స్కు మరింత క్రేజ్ ఏర్పండి. స్టార్ హీరోలు కూడా ఈగోలకు పోకుండా మల్టీస్టారర్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే తాజాగా మరో మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారట.
ఈ క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. నాగార్జున తాజా చిత్రం `ది ఘోస్ట్` అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న మేకర్స్ `ది ఘోస్ట్` ట్రైలర్ ను బయటకు వదిలారు. మహేశ్ బాబు స్వయంగా ఈ ట్రైలర్ను లాంఛ్ చేశారు. అలాగే మహేశ్ ఈ మూవీ మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ టీమ్ మొత్తానికి ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపాడు.
అయితే మహేష్ ట్వీట్ కు నాగార్జున థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు, ఆసక్తికర కామెంట్స్ కూడా చేశాడు. `29 ఏళ్ల కిందట వారసుడు సినిమాలో మీ నాన్న సూపర్ స్టార్ కృష్ణ నాతో కలిసి నటించినప్పుడు చాలా ఆనందాన్నిచ్చింది. మనం కలిసి ఓ సినిమా ఎందుకు చేయకూడదు?` ప్రశ్నించారు.
ఇక నాగార్జున ట్వీట్ కు మహేష్ బాబు స్పందించారు. `సంపూర్ణ ఆనందంగా ఉంటుంది. ఎదురు చూడాల్సిన విషయం` అన్నట్లుగా మహేష్ బాబు రిప్లై ఇచ్చారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో త్వరలోనే ఓ మల్టీస్టారర్ ఉంటుందని, ఏదో ప్లాన్తోనే వీరిద్దరూ ఉన్నారని భావిస్తున్నారు.
Hey @urstrulyMahesh !! I was so happy 29 years ago when your father SuperStar Krishna Garu joined me for the film Varasudu !! Why don’t we complete the circle 😊
Thank you for releasing #TheGhostTrailer 👍💥 https://t.co/cbgu8vtpH1
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2022