టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన నాగచైతన్య – సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు స్నేహం, ఆ తర్వాత రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట 2017 లో పెద్దల అంగీకారంతో గోవా వేదికగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు.
పెళ్లై నాలుగేళ్లు గడవకముందే విడాకుల బాట పట్టి అందరికీ షాక్ ఇచ్చారు. వీరి విడాకులపై ఎన్నో ప్రచారాలు జరిగాయి. మరెన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా సమంతను చాలా మంది కార్నర్ చేస్తూ తీవ్రంగా విమర్శించారు. అన్నింటినీ మౌనంగా భరించిన నాగచైతన్య, సమంతలు ప్రస్తుతం ఎవరి వర్క్ లో వారు బిజీ అయిపోయారు. అయితే తాజాగా వీరి విడాకులపై నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు.
`బ్రహ్మాస్త్ర` ప్రమోషన్స్లో భాగంగా నాగార్జున తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయనకు తనయుడు నాగచైతన్య పై ఓ ప్రశ్న ఎదురైంది. `నాగ చైతన్య ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఇది అతన్ని బాధించడం లేదా?` అనే ప్రశ్న అడగగా.. అందుకు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. `నాగచైతన్య హ్యాపీ గా ఉన్నాడు. అతను సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. చైకి జరిగింది ఒక అనుభవం. కానీ అది దురదృష్టకరం. అలా అని దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. సామ్ మా జీవితాల నుంచి వెళ్ళిపోయింది. ఎవరి లైఫ్ లో అయినా ఇలాంటివి జరిగితే దాని నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జున కామెంట్స్ కస్త నెట్టింట వైరల్ గా మారాయి.
Samantha- Naga Chaitanya : విడాకుల ప్రకటనకి సరిగ్గా నెల రోజుల ముందు జరిగింది ఇదే..!
Samantha-Naga Chaitanya: చైతు ఫోటోను షేర్ చేసిన సమంత.. విడుకుల తర్వాత తొలిసారి ఇలా..?!
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!