టాలీవుడ్ కింగ్ నాగార్జునను ఆయన భార్య, ఒకప్పటి హీరోయిన్ అమల కన్నీరు పెట్టించారట. అసలేం జరిగిందంటే.. చాలా కాలం తరువాత అమల `ఒకే ఒక జీవితం` రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ ఇందులో జంటగా నటించారు.
శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ఇందులో కీలక పాత్రలను పోషించారు. అలాగే ఈ సినిమాలో శర్వానంద్కు తల్లి పాత్రలో అమల కనిపించబోతోంది.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ సెప్టెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేకర్స్.. తాజాగా సెలెబ్రిటీల కోసం హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి నాగార్జున, అమల, అఖిల్ తో పాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు.
అయితే ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున అమల నటనకి కంటతడి పెట్టుకున్నారట. అంత అద్భుతంగా ఆమె నటించారట. ఈ క్రమంలోనే అమల మరియు చిత్ర టీమ్పై నాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మరోవైపు అఖిల్ సైతం తన తల్లి నటనపై ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.