మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా చేసిన తాజా చిత్రం `సీతారామం`. ఇదో అందమైన ప్రేమ కావ్యం. టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తే.. రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, భుమిక చావ్లా, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
దేశాన్ని ప్రేమించే ఓ అనాథ సైనికుడు.. దేశమంత ప్రేమని ఆ సైనికుడిపై ధారబోసే ఓ అమ్మాయికీ మధ్య జరిగిన ప్రయాణం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఆగస్టు 5న తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుండే పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. టాక్ బాగుండటంతో.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది.
నిన్న 6వ రోజుతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ను బద్దలు కొట్టి.. హిట్ లిస్ట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ లాభాల బాట పట్టడంతో.. మేకర్స్ తాజాగా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున హాజరు అయ్యాయి. అయితే ఈ సందర్భంగా నాగ్ `సీతారామం` సక్సెస్పై అసూయగా ఉందంటూ కామెంట్స్ చేశారు. అవి కాస్త వైరల్గా మారాయి.
అయితే నాగార్జున సరదాగానే ఆ కామెంట్స్ చేశారు. `సీతారామం`లో తాను చేయాల్సిన పాత్ర దుల్కర్ చేశాడని.. ఇప్పుడు ఈ విజయం చూశాక తనకు అసూయగా అనిపిస్తోందంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. అనంతరం చిత్ర విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈయన మాటలతో ఓ విషయం స్పష్టమైంది. దుల్కర్ కంటే ముందు `సీతారామం` కథ నాగార్జున వద్దకు వెళ్లింది.. కానీ, ఆయన ఈ మూవీని రిజెక్ట్ చేశారు. దాంతో ఇప్పుడు నాగ్ బిగ్ హిట్ను మిస్ అయ్యారు.