Ponniyin Selvan 1: సౌత్ ఇండియా టాప్ మోస్ట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు 5 రోజుల్లోనే 200 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషలో విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. చరిత్రను వక్రీకరించి మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ తెరకెక్కించినట్లు తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కామెంట్లు చేస్తున్నారు. రాజరాజ చోళులను హిందువులుగా చుపించారంటూ మండిపడుతున్నారు.
ఇటువంటి తరుణంలో డైరెక్టర్ మణిరత్నం పై వస్తున్న విమర్శలకు ఇండస్ట్రీ నుండి ప్రముఖులు అడ్డుకుంటున్నారు. తాజాగా కింగ్ నాగార్జున ‘పొన్నియిన్ సెల్వన్ 1’ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘పొన్నియిన్ సెల్వన్ 1’ అద్భుతంగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించారని తెలిపారు. ఇటువంటి అద్భుతాలు ఆయన వల్లే సాధ్యమని పేర్కొన్నారు. ‘పొన్నియిన్ సెల్వన్’… మణిరత్నం ఎన్నో ఏళ్ల కల అని .. ఈ ప్రాజెక్టు గురించి గతంలో ఎన్నోసార్లు తనతో చర్చించినట్లు నాగార్జున గుర్తు చేశారు. ఇదే సమయంలో మణిరత్నం దర్శకత్వంలో నటించిన “గీతాంజలి” మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని తెలియజేశారు. ఇదిలా ఉంటే మరోపక్క ‘పొన్నియిన్ సెల్వన్’ విషయంలో కమలహాసన్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.
తెలుగు ఇంకా మరికొన్ని భాషల్లో ఆదరణ లేకపోవడంతోనే కావాలని కొంతమంది వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. మనం శంకరాభరణాన్ని ఆదరిస్తే వాళ్లు మరోచరిత్రను ఆదరించారని గుర్తు చేశారు. ఇదే సమయంలో అసలు చోళ రాజులు హిందువులు కాదని కూడా కమలహాసన్ కీలక కామెంట్లు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే తమిళ సినిమా రంగంలో ‘పొన్నియిన్ సెల్వన్’ అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.