టాలీవుడ్ కింగ్ నాగార్జున నేడు ` ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. గుల్ పనాగ్, అనైక సురేంద్రన్, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.
యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలను ఇష్టపడేవారికి `ది ఘోస్ట్` ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సంగంతి పక్కన పెడితే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు `ది ఘోస్ట్` మూవీని సొంతం చేసుకున్నారట.
తెలుగు సహా హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేటర్స్లో విడుదలైన ఆరు వారాల తర్వాతే ఓటీటీలోకి రాబోతోందని అంటున్నారు. ఇక ఎలాగో ఇప్పుడప్పుడే ఓటీటీలోకి రాదు. కాబట్టి, థియేటర్స్ లో ఈ సాలిడ్ థ్రిల్లర్ ని చూసి ఎంజాయ్ చేయండి.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!