టాలీవుడ్ కింగ్ నాగార్జున రీసెంట్గా `ది ఘోస్ట్` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తే.. గుల్ పనాగ్, అనైక సురేంద్రన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.
దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. సోలోగా హిట్ కొట్టి చాలా కాలం అవ్వడంతో.. ఈ సినిమాతో అయినా నాగార్జున హిట్ కొట్టాలని ఆశపడ్డాడు. కానీ, ఆయనకు నిరాశే ఎదురైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజే నుంచి యావరేజ్ వసూళ్లను దక్కించుకుంటూ వచ్చింది.
వరల్డ్ వైడ్గా రూ. 21.15 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. అయితే ఆల్ మోస్ట్ థ్రియేటకల్ రన్ పూర్తి అయ్యే సమయానికి ఫైనల్గా ఈ చిత్రం రూ. 6 కోట్లకు అటు ఇటుగా షేర్ను సొంతం చేసుకుంది.రిజల్ట్ విషయం పక్కన పెడితే నాగార్జున ఈ చిత్రంలో యాక్షన్ స్టంట్స్ అద్భుతంగా చేశాడు. పవర్ ఫుల్ పర్ఫామెన్స్తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇక ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ `ది ఘోస్ట్` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని నవంబర్ 2 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెల్ఫ్లిక్స్ వెల్లడించింది. మరి ఈ చిత్రం ఓటీటీలో అయినా మంచి విజయం సాధిస్తుందేమో చూడాలి.