Nani: గత ఏడాది `శ్యామ్ సింగరాయ్`తో బిగ్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని.. తాజాగా `అంటే..సుందరానికీ!`తో ప్రేక్షకులను పలకరించాడు. నిన్న అట్టహాసంగా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. నాని శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో `దసరా` అనే ఓ మాస్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ స్వరాలను సమకూరుస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ కొంత షూటింగ్ను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ `దసరా` చిత్రాన్ని దసరా పండగ కానుకగా విడుదల చేయాలని నాని భావించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, ఇప్పుడు ఆ విషయంలో ఆయన మనసు మార్చుకున్నారట. అనుకున్నట్టుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగడం లేదు. దసరా సమయానికి షూటింగ్ మరియు ఇతర పనులు పూర్తి కావడం కష్టం. ఈ నేపథ్యంలోనే దసరాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.
గత ఏడాది క్రిస్మస్ మనదే అంటూ `శ్యామ్ సింగ రాయ్`తో వచ్చి నాని హిట్ కొట్టాడు. అందుకే క్రిస్మస్ను ఆయన టార్గెట్గా పెట్టుకున్నట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. అయితే రీలీజ్ ఆలస్యం అవుతుండటంతో ఆయన అభిమానులు కాస్త అసహనంగా ఉన్నారని అంటున్నారు. కాగా, తెలంగాణకు చెందిన సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో నాని మున్నెప్పుడూ కనిపించని మాస్ అవతార్లో కనిపించబోతున్నాడు. అలాగే తొలిసారి పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు.