Naresh-Pavitra Lokesh: సినీ నటుడు నరేష్ వ్యవహారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వివాదాస్పదంగా మారింది. భార్య రమ్య రఘుపతి నుండి విడిపోయిన తర్వాత పవిత్ర లోకేష్ తో నరేష్ ఉంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాదే పవిత్ర లోకేష్ కి లిప్ లాక్ ముద్దు పెట్టి ఈ ఏడాది కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు.. అందరి ఆశీర్వాదాలు కావాలని వీడియో కూడా నరేష్ పోస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో రమ్య రఘుపతి నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారంపై ఎప్పటినుండో సీరియస్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నరేష్ తనకు రమ్య రఘుపతి ఇంకా రోహిత్ శెట్టి నుంచి ప్రాణహాని ఉందని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
రమ్యతో పెళ్లయిన నాటినుండి తనకి మనశ్శాంతి లేదని… ఆమెతో కలిసి జీవించలేనని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆమెకు విపరీతంగా మద్యం సేవించడంతోపాటు స్నేహితుల ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలలో పార్టీలలో తరచూ పాల్గొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని అన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో భార్య రమ్య రఘుపతి వ్యవహరిస్తుందని… నాపై కంటే ఆస్తులు మరియు డబ్బు పైన ఆమెకు ఎక్కువ వ్యామోహం ఉందని ఈ పిటిషన్ లో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా తనతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి పది కోట్ల రూపాయలను కూడా రమ్యా రఘుపతి డిమాండ్ చేసినట్లు నరేష్ ఆరోపించారు. ఈ క్రమంలో కొంతమంది మధ్యవర్తులు కూడా తన వద్దకు వచ్చారని తెలిపారు.
అయితే తాను అంగీకరించలేదని దీంతో తనను హత్య చేయడానికి రోహిత్ శెట్టితో కొట్ర పన్నారని దీనికోసం గత ఏడాది నిర్వహించడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీమంత్రి రఘువీరారెడ్డి తో ఫోన్ చేయించి బెదిరించటం కూడా జరిగిందని పిటిషన్ లో నరేష్ వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఓ పోలీస్ అధికారి కూడా రమ్యకు సహకరిస్తున్నారని తన ఫోన్ హ్యాక్ చేశారని బ్లాక్మెయిల్..కీ పాల్పడుతున్నారని ఆరోపించాడు. దీంతో రమ్య రఘుపతి నుంచి విడాకులు ఇప్పించాలని హైకోర్టులో నరేష్ పిటిషన్ వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.