Nayan-Vignesh: కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్లు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ జంట.. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల నడుమ వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. సినీ ప్రిముఖులు, రాజకీయ నాయకులు సైతం వీరి పెళ్లిలో సందడి చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వివాహం అనంతరం గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయలనుకున్నా.. ఆ తర్వాత నయన్-విఘ్నేశ్లు తమ ప్లాన్ను మార్చుకున్నారు. రిసెప్షన్ను క్యాన్సిల్ చేసి.. ఆ డబ్బుతో తమిళనాడులోని అన్ని అనాధ ఆశ్రమాలకు ఒకరోజు భోజనాన్ని అందించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇకపోతే ఈ కొత్త జంట తాజాగా హనీమూన్కు చెక్కేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
హనీమూన్ కోసం నయన్-విఘ్నేశ్లు థాయ్లాండ్ ను ఎంచుకున్నారు. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ఓ లగ్జరీ హోటల్లో దిగారు నయన్ దంపతులు. దీనికి సంబంధించిన ఫొటోలను విక్కీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశాడు. అలాగే వీరు ఫ్లైట్లో ప్రయాణించే సమయంలో వారితో కలిసి ఓ అభిమాని సెల్ఫీ తీసుకున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈ ఫొటో సైతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది. ఇక హనీమూన్ అనంతరం నయన్-విఘ్నేశ్లు మళ్లీ వర్క్లో బిజీ కానున్నారని తెలుస్తోంది. నయనతార ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న `గాడ్ ఫాదర్`లో కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే తమిళంలోనూ పలు ప్రాజెక్ట్స్ను టేకప్ చేసింది.