లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేశ్ శివన్ పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులు అయ్యారు. అవును, మీరు విన్నది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న ఈ కోలీవుడ్ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.
అయితే తాజాగా ఈ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ అబ్బాయిలే. ఈ విషయాన్ని విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించాడు. `నయన్, నేను తల్లిదండ్రులు అయ్యాం. మాకు ట్విన్స్ పుట్టారు. ఇద్దరూ అబ్బాయిలే. మా ప్రార్థనలు, పెద్దల ఆశీర్వాదాలు.. అన్నిటికి మంచి చల్లటి చూపులు కలిసి మా ఇద్దరికీ మరో ఇద్దర్ని భగవంతుడు ప్రసాదించాడు.
మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఇక నుంచి వీళ్ళే మా ప్రాణం, ప్రపంచం. జీవితం ఇప్పుడు మరింత అందంగా ఉంది. ప్రకాశవంతంగా మారింది. గాడ్ ఈజ్ డబుల్ గ్రేట్` అంటూ విఘ్నేష్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఉయిర్, ఉలగం అంటూ తమ కవలలకు పేర్లు పెట్టేశారు. అలాగే తమ ఇద్దర పిల్లల పాదాలను ముద్దాడుతూ దిగిన ఫోటోలను సైతం ఆయన షేర్ చేశారు.
దీంతో ఆయన పోస్ట్ క్షణాల్లో వైరల్గా మారింది. ఈ క్రమంలోనే పెళ్లైన 4 నెలలకే పిల్లలు పుట్టడం ఏంటంటూ అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
https://twitter.com/NayantharaU/status/1579095046946979841?s=20&t=TTSrhuOghymaAIriRmPFAQ