Nayan-Vignesh: లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. నేడు కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేశ్ శివన్ను అంగరంగ వైభవంగా ప్రేమ వివాహం చేసుకుంది. దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న నయన్-విఘ్నేశ్లు తమిళనాడులోని మహాబలిపురం షెరటాన్ హోటల్ లో ఇవాళ ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు.
2015లో వచ్చిన `నానున్ రౌడీదాన్` అనే సినిమాతో నయన్-విఘ్నేశ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారగా.. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వయసులో నయన్ కంటే విఘ్నేశ్ సంవత్సరం చిన్నవాడు. అయితే వీరి ప్రేమకు వయసు అడ్డు కాలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో.. వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే పెళ్లి కాగానే నయన్-విఘ్నేశ్లు తమ గొప్ప మనసు చాటుకున్నారు. ఇంతకీ వీరు ఏం చేశారో తెలుసా.. తమ వివాహం సందర్భంగా ఏకంగా లక్ష మంది అనాధ చిన్నారులకు భోజనాలను ఏర్పాటు చేశారట.
ఈ విషయం బయటకు రావడంతో.. నూతున వధూవరులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాగా, అత్యంత ప్రముఖ వ్యక్తులు మాత్రమే నయన్ విఘ్నేష్ ల పెళ్లికి హాజరు అయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్, దర్శకుడు మణిరత్నం, కార్తీ, రాధికా శరత్ కుమార్ దంపతులు, నిర్మాత బోనీకపూర్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, దర్శకుడు అట్లీ, బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తదితరులు సందడి చేశారు.