గత ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార-విగ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే ఈ దంపతులు కవలలకు జన్మనిచ్చారు. సరోగసి ద్వారా నయన్ దంపతులు పండంటి మగ పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
అయితే వీరి సరోగసి పద్ధతి వివాదం అయిన విషయం విధితమే. తమిళనాడు ప్రభుత్వం సైతం రంగంలోకి దిగి వీరి సరోగసి పద్ధతిపై అన్ని వైపుల నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ఇండియాలో సరోగసి విధానానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సరోగసి ద్వారా పిల్లలను కనాలంటే పెళ్లి జరిగి ఐదేళ్లు గడిచి ఉండాలి.
అలాగే సరోగేట్ మదర్ దంపతులకు దగ్గర బంధువు అయి ఉండాలని కూడా చట్టం చెబుతోంది. అయితే తాజాగా నయన్ దంపతులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వారు ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ దంపతులు ఆరేళ్ల క్రితమే చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారట.
ఇందుకు సంబంధించిన పత్రాలన్నీ సమర్పించారట. ఇటీవల సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నామని తెలిపారట. అలాగే సరోగేట్ మదర్ కూడా యూఏఈ కి చెందిన నయన్ బంధువే అని వారు పేర్కొన్నానట. తాము ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని నయన్ దంపతులు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
https://newsorbit.com/cinema/police-case-file-on-nayanthara-and-vignesh-shivan.html
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!