లేడీ సూపర్ స్టార్ నయనతారకు తల్లి అయ్యాక కొత్త తలనొప్పి మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో నయనతార, కోలీవుడ్ దర్శకనిర్మాత విగ్నేష్ శివన్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
అయితే పెళ్లై నాలుగు నెలలకే అనూహ్యంగా ఈ దంపతులు తమకు ట్విన్స్ పుట్టారంటూ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10 న విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా తమకు పండంటి మగ పిల్లలు జన్మించారని వెల్లడించారు. దీంతో ఈ విషయం అనేక చర్చలకు దారి తీసింది. అయితే పెళ్లై కొద్ది నెలలే కడవడంతో వీరిద్దరూ సరోగసి ద్వారా పిల్లలను కన్నారని వాదన బలంగా వినిపిస్తోంది. అదే నిజం కూడా.
దీంతో అసలు రచ్చ మొదలైంది. ఇప్పటికే సరోగసి ద్వారా చాలా మంది సెలబ్రిటీలు పిల్లలు కన్నారు. కానీ నయన్ సరోగసి విధానం వివాదంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. ఇండియాలో కమర్షియల్ సరోగసి విధానాన్ని రద్దు చేశారు. కొత్త చట్టాన్ని అనుసరించి సరోగసి విధానంలో పిల్లల్ని కనాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి 25 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
ఈ క్రమంలోనే నయనతార దంపతులు కొత్త చట్టాన్ని అనుసరించే సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారా..? లేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ గతేడాది డిసెంబర్ కంటే ముందు నయన్ దంపతులు వైద్య పరీక్షలకు వెళ్లుంటే ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే, అప్పటికింకా కొత్త చట్టం రాలేదు. డిసెంబర్ 2021 తరవాత వెళ్లంటే మాత్రం చిక్కులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో అల్రెడీ తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. నయన్ దంపతుల సరోగసి ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్న విషయంలో ఆరోగ్య శాఖ విచారణ పట్టింది. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ స్వయంగా వెల్లడించారు.
https://newsorbit.com/entertainment-news/netizens-appreciate-to-nayanthara.html