`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు ఇది 107వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎన్బీకే107` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ప్రారంభించారు.
ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తున్నాడు. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రను పోషించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయట. దాదాపు రూ. 60 కోట్లు చల్లించి మరీ ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ను కొనగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనా నాన్ థియేట్రికల్ రైట్స్కే ఈ రేంజ్ ధర పలికితే.. థియేట్రికల్ రైట్స్ కు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి `జై బాలయ్య`, `అన్నగారు` వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!