సమంత చేతిలో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో `శాకుంతలం` ఒకటి. పౌరాణిక గాథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సమంత టైటిల్ రోల్ను పోషింస్తుంటే.. ఆమె జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. మోహన్ బాబు, అల్లు అర్హ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ, అంతలోనే విడుదల వాయిదా అంటూ అనౌన్స్ చేశారు.
3డీ ఫార్మాట్లో బెస్ట్ క్వాలిటీతో విడుదల చేయాలని గుణశేఖర్ టీం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే రిలీజ్ డేట్ను పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ విషయంలో సమంత ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. శాకుంతలం విడుదల ఎప్పుడు ఉంటుందా అని ఈగర్గా వెయిట్ చేశారు.
అయితే తాజాగా `శాకుంతలం` విడుదలపై నయా అప్డేట్ ఇచ్చింది నిర్మాత నీలిమ గుణ. శాకుంతలం కథను విభిన్నమైన అనుభూతిలో పంచాలనే ఉద్దేశ్యంతో త్రీడీలో కూడా రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పనులు పూర్తి అయిన వెంటనే థియేటర్లలో విడుదల చేస్తామని.. అతి త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని నీలిమ తెలిపారు. కాగా, వచ్చే నెల 4వ తేదీన సమంత నటించిన `యశోద` విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత శాకుంతలం విడుదల ఉండొచ్చని అంటున్నారు.