టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కాలికి గాయమైన సంగతి తెలిసిందే. చీలమండలో చీలిక ఏర్పడిందని చెబుతూ బ్యాండేజీ వేసిన కాలు పిక్ను నిన్న ఇన్స్టాగ్రామ్ ద్వారా పూజా హెగ్డే స్వయంగా తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ `కిసి కా భాయ్ కిసి కి జాన్` షూటింగ్లో పాల్గొంటుంది.
ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తుంటే.. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లోనే పూజ హెగ్డే గాయపడిదని ప్రచారం జరిగింది. ఇక కాలికి గాయం అవ్వడంతో పూజా హెగ్డే కొద్ది రోజులు షూటింగ్కు దూరంగా ఉండొచ్చని అంచనా వేశారు.
కానీ, గాయమై ఒక రోజు కూడా గడవకుండానే పూజా హెగ్డే షూటింగ్ లొకేషన్ లో ప్రత్యక్షమైంది. కాలుకు బ్యాండేజీతోనే మేకప్ రూమ్ లో ఉన్న ఫొటోను షేర్ చేసిన పూజా `షో నడవాల్సిందే` అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పూజా హెగ్డే నిజంగా గ్రేట్ అని.. వర్క్ పట్ల ఆమెకు ఉన్న డెడికేషన్ సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, సినిమా విషయానికి వస్తే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ `ఎస్ఎస్ఎమ్బీ 28`లో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తీయబోయే `జనగణమన`లోనూ హీరోయిన్ గా ఎంపిక అయింది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం పూజా చేతిలో ఉన్నాయి.