Kiara Advani: బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా రాణిస్తున్న అందాల భామ కియారా అద్వానీ.. ఇటీవల `భూల్ భులయా 2` చిత్రంతో పలకరించి భారీ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడిదే జ్యోష్లో `జగ్ జగ్ జీయో` అనే మరో మూవీతో నార్త్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటించారు.
అనిల్ కపూర్, నీతూ కపూర్ లు ముఖ్య పాత్రలను పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్లపై హిరు యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ మూవీ జూన్ 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తునన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో భాగంగానే కియారా తాజాగా హీరో వరుణ్ ధావన్తో కలిసి ముంబై మెట్రో రైలులో సందడి చేశారు. అక్కడ సినిమాను ప్రమోట్ చేసుకోవడంతో పాటు అడిగిన వారికి సెల్ఫీలు ఇచ్చారు. అలాగే వరుణ్తో కలిసి కియారా మెట్రోలో వడ పావ్ తింటూ ఎంజాయ్ చేసింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారడంతో.. నెటిజన్లు కియారా, వరుణ్ ధావన్పై ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే, మెట్రోలో ఆహార పదార్థాలు అనుమతి లేదు. అయితే కియారా-వరుణ్లు మెట్రోలో నిబంధనలకు విరుద్ధం ప్రవర్తించి అడ్డంగా బుక్కైయ్యారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరిపై మెట్రో అధికారులు చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CeySG2NjuNB/?utm_source=ig_web_copy_link