నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ అనంతరం బాలయ్య నుంచి రాబోతున్న చిత్రమిది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్గా చేస్తుంటే.. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది.
బాలయ్య కెరీర్లో తెరకెక్కుతోన్న 107వ చిత్రమిది. ఈ మూవీకి `వీరసింహారెడ్డి` అనే పవర్ టైటిల్ను మేకర్స్ తాజాగా కన్ఫామ్ చేశారు. దీంతో ఈ సినిమాపై ఓ సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే.. బాలయ్య సినీ కెరీర్లో `రెడ్డి` పేరుతో వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.
`సమరసింహారెడ్డి`, `చెన్నకేశవరెడ్డి` తదితరల చిత్రాలు ఈ లిస్ట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు రెడ్డి సెంటిమెంట్ రిపీట్ అయితే.. `వీరసింహారెడ్డి` సినిమా సైతం బ్లాక్ బస్టరే అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగిదే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.
కాగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. బ్యాలెన్స్ షూటింగ్ను సైతం త్వరత్వరగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను దింపేందుకు మేకర్స్ జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు.