ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైస్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది.
గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం ఊహించని రేంజ్ లో వసూళ్లను రాబట్టి మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి పార్ట్ 2 గా `పుష్ప ది రూల్` రాబోతోంది. పుష్ప 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.
ప్రస్తుతం పోస్టర్ డిజైన్ కోసం షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవరికర్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే `పుష్ప ది రైస్` మూవీ ని కూడా ఇదే విధంగా ఫోటో షూట్ తో ప్రారంభించగా.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇప్పుడు `పుష్ప 2`ను కూడా ఇదే విధంగా ప్రారంభించారు. మరి ఫోటో షూట్ సెంటిమెంట్ రిపీట్ అయితే పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అని అంటున్నారు. కాగా, ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్గా కనిపించబోతున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.