మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో తెరకెక్కబోయే ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నిర్మితం అవుతోంది.
అలాగే బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది. మరో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిస్తోంది. అయితే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఫిబ్రవరిలోనే ప్రారంభించినా.. ఇప్పటి వరకు సెట్స్ మీదకు మాత్రం వెళ్లలేదు. ఈ విషయంపై నెట్టింట రకరకాల ప్రచారాలు జరిగాయి.
అవన్నీ పక్కన పెడితే.. మహేశ్-త్రివిక్రమ్ మూవీపై నయా అప్డేడ్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ముహుర్తం పెట్టేశారట. మరో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోందట.
సెప్టెంబర్ 12వ తేదీ అంటే సోమవారం నుంచి ఈ సినిమాను మొదలుపెట్టనున్నట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది. అంతేకాదు, ఫస్ట్ షెడ్యూల్లో మహేశ్ బాబు, పూజా హెగ్డేలతో సహా ముఖ్య పాత్రదారులు సైతం పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!