మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయనకు జోడీగ కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు.
అలాగే శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్ జె సూర్య, జయరాం తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పుడు ఏపీలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. చరణ్ ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీని రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఇప్పటి వరకు ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే మేకర్స్ టైటిల్ అనౌన్స్మెంట్కు డేట్ లాక్ చేశారట. దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 24న టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇందుకు మేకర్స్ ఏర్పాట్లు సైతం షురూ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో లేదా ఆఖరిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.