టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన `కార్తికేయ` 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇటీవల చందు మొండేటి `కార్తికేయ 2`ను రూపొందించారు. ఈ చిత్రంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.
అనేక వాయిదాల అనంతరం ఆగస్టు 13న పాన్ ఇండియా స్థాయి లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసింది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి ఎన్నో రికార్డులు నెలకొల్పింది.
అయితే ఇప్పుడు మేకర్స్ `కార్తికేయ 3` కోసం రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా కన్ఫామ్ చేశాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కార్తికేయ 3పై సినీ లవర్స్ పండగ చేసుకునే నయా అప్డేట్ ను రివిల్ చేశారు. ఇంతకీ నిఖిల్ ఏం చెప్పాడంటే..
`కార్తికేయ సినిమా రెండు భాగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందరి దీవెనలతో కార్తికేయ 3 ను తీయబోతున్నాము. ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తామా అని చాలా ఆతృతగా ఉంది. ఎందుకంటే దీనిని 3డీలో రూపొందించనున్నారు` అంటూ చెప్పుకొచ్చాడు. నిఖిల్ ఇచ్చిన అప్డేట్తో `కార్తికేయ 3` ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు