కృతి శెట్టి.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో గ్రాండ్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ వెంటనే `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. దీంతో కృతి శెట్టి ఉంటే సినిమా హిట్ అనే టాక్ బలంగా వినిపించింది.
ఇంకేముంది టైర్-2 హీరోలే కాదు స్టార్ హీరోలు సైతం కృతి శెట్టి వెంట పడటం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వరుస ప్లాపులతో సతమతం అవుతున్న హీరో నితిన్ సైతం కృతి శెట్టిని నమ్ముకుని.. తన తదుపరి చిత్రమైన `మాచర్ల నియోకవర్గం`లో ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించారు.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో నితిన్ అలరించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఫైనల్గా ఈ మూవీని ఆగస్టు 12న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
వరుస అప్డేట్స్ను బయటకు వదులుతూ సినిమాపై మంచి హైప్ను క్రియేట్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది.. కానీ, ఇప్పుడు నితిన్లో కొత్త కలవరం మొదలైంద. అందుకు కారణం కృతి శెట్టి నటించిన తాజా చిత్రం `ది వారియర్` ఫ్లాప్ అవ్వడమే. బ్రేకుల్లేని హిట్స్తో దూసుకుపోతున్న కృతి శెట్టి ఖాతాలో తొలి ఫ్లాప్ నమోదు అయింది. దీంతో ఇప్పటి వరకు కృతి శెట్టి కారణంగా పీక్స్లో ఉన్న నితిన్ కాన్ఫిడెన్స్.. ది వారియర్ ఫ్లాప్తో డౌన్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది.