`భీష్మ` తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న యంగ్ స్టార్ నితిన్.. రీసెంట్గా `మాచర్ల నియోజకవర్గం`తో ప్రేక్షకులను పలకరించాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు.
సముద్రఖని విలన్గా నటిస్తే.. శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజి, మురళిశర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 12న విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ కథను పరమ రొటీన్గా తెరకెక్కించారంటూ అభిమానులు సైతం పెదవి విరిచారు.
దాంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అంతంగా మాత్రంగానే ఉన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని నితిన్ కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఇకపోతే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దాని ప్రకారం.. `మాచర్ల నియోజకవర్గం` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట.
అయితే ఎలాగో బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాలేదు. కాలెక్షన్స్ కూడా అనుకున్న స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలోనే `మాచర్ల నియోజకవర్గం`ను విడుదలైన నెలలోపే ఓటీటీ దింపేయాలని భావిస్తున్నారట. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.