టాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రమే `శాకిని డాకిని`. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మించారు.
కొరియన్ సినిమా `మిడ్ నైట్ రన్నర్స్` కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి బజ్ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెజీనా, నివేదాలు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అలాగే ఈ భాయలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ను పొగడ్తలతో ముంచేశాడు. నివేదా అల్రెడీ ఎన్టీఆర్ కు జోడీగా `జై లవకుశ` మూవీలో నటించింది. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎనర్జీ అద్భుతం.. ఎంత పనిచేసినా అలసిపోవడం అంటూ ఉండదు. అందుకే ఆయన్ను చూసినప్పుడల్లా నాకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఇక ఆయన వ్యక్తితత్వం కూడా ఎంతో గొప్పది` అంటూ చెప్పుకొచ్చింది.
మరోవైపు రెజీనా మాట్లాడుతూ.. `ఎన్టీఆర్ చాలా మంచోరు.. మంచి మనసున్నవారు. తనను చాలా సార్లు తో అభినందించారు. అలాంటి వారు అరుదుగా ఉంటారు. అందుకే ఎన్టీఆర్ అంటే నాకు అమితమైన ఇష్టం. ఆయనతో నటించే అవకాశం వస్తే వదులుకోను` అంటూ పేర్కొంది. మొత్తానికి రెజీనా, నివేదాలు ఎక్కడా తగ్గకుండా ఎన్టీఆర్ను ఆకాశానికి ఎత్తేశారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!