యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగర శివార్లలో గల శంకర్ పల్లిలో సుమారు ఆరున్నర కోట్లు ఖరీదు చేసే స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ స్థలంలో ఓ అద్భుతమైన ఫామ్ హౌస్ను నిర్మించి.. సతీమణి లక్ష్మీ ప్రణతి బర్త్డేకు గిఫ్ట్గా వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఆ కొత్త ఫామ్ హౌస్లోనే ఎన్టీఆర్ భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫ్యామిలీని మీడియాకు కాస్తా దూరంగా ఉంచే ఎన్టీఆర్.. స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ఓ పిక్ను షేక్ చేశాడు. అందులో ఎన్టీఆర్, ప్రణతి కాఫీ తాగుతూ.. ఒకరికొకరు కబర్లు చెప్పుకుంటూ చుడమచ్చటగా కనిపించారు.
కొత్త ఫామ్ హౌస్లో స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ సంతోష క్షణాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ షేర్ చేసిన పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన అభిమానులు ఈ ఫొటోను చూసి తెగ మురిసిపోతున్నారు. కాగా, ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. `ఆర్ఆర్ఆర్`తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను ఖాతాలో వేసుకున్న ఈయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను కొరటాల శివతో ప్రకటించాడు.
`ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
https://www.instagram.com/p/Cgtg6jEPlAn/?utm_source=ig_web_copy_link
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!