యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో అత్యంత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకున్న చిత్రం `బ్రహ్మాస్త్ర`. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, అలియా భట్ ఇందులో జంటగా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. తెలుగులో రాజమౌళి ఈ సినిమాను సమర్పిస్తున్నారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ నార్త్ తో పాటు సౌత్లోనూ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో `బ్రహ్మాస్త్ర` ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారని అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ను చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
పైగా ఈ ఈవెంట్లో `ఎన్టీఆర్ 30`కి సంబంధించి ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ రాబోతోందంటూ గత రెండు రోజుల నుండీ ప్రచారం జరుగుతుండటంతో.. అభిమానులు ప్రీ రిలీజ్ పంక్షన్పై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ, వారి ఆశలన్నీ గల్లంతు అయ్యాయి. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ కన్ఫార్మ్స్ చేసేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు అనుమతులు నిరాకరించడమే ఇందుకు కారణమని అంటున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.