గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న టాలీవుడ్ టాలెంటెడ్ మీరో శర్వానంద్ నేడు `ఒకే ఒక జీవితం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తే.. అమల అక్కినేని శర్వాకు తల్లి పాత్రను పోషించింది. నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలను పోషించారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకార్తిక్ దర్శకత్వం వహించాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూ వెల్లువెత్తాయి. శర్వానంద్ నటన పరంగా ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు.
అలాగే ఆయన కెరీర్ లో ఎప్పటికీ గుర్తిండి పోయే చిత్రాల్లో `ఒకే ఒక జీవితం` ఒకటిగా నిలుస్తుందని అనడంలో ఎటువంటి సందేమం లేదు. ఇకపోతే ఈ మూవీ ఓటీటీ రైట్స్ కు సంబంధించి ఓ క్రేజీ టాక్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందట.
అయితే సినిమా హిట్ టాక్ ను సంపాదిస్తే రూ. 11 కోట్లుగా, అవరేజ్ గా నిలిస్తే రూ.8 కోట్లకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారట. ఇక ఎలాగో సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ ఓటీటీ రైట్స్ రూ. 11 కోట్లకు అమ్ముడు పోయాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే శర్వా సినిమా భారీ ధర పలికినట్లే అని అంటున్నారు.