Pakka Commercial Trailer: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పక్కా కమర్షియల్`. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 బ్యానర్లపై అల్లు అరవింద్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలను పోషించారు.
కొద్ది రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ను బయటకు వదిలారు. ఇందులో గోపీచంద్, రాశీ ఖన్నాలు లాయ్యర్స్గా అలరించబోతున్నారు. ఎలాంటి తప్పు చేసినవాడికైనా కోర్టులో శిక్ష పడకుండా చేసే వ్యక్తిగా గోపీచంద్ కనిపిస్తే.. న్యాయాన్ని కాపాడుకోవడానికి కన్న కొడుకుతోనే పోరాటానికి దిగే తండ్రిగా సత్యరాజ్ నటించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తండ్రీ, కొడుకుల మధ్య సాగే ఆసక్తికర పోరునే ఈ చిత్రంలోనే మారుతి చూపించబోతున్నాడు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా దేనికీ కొదవ లేకుండా సినిమాను రూపొందించారని ట్రైలర్ బట్టీ అర్థమైంది. అలాగే మారుతీ మార్క్ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది. `మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్` అని చెబుతూ గోపీచంద్ అదరగొట్టేశాడు.
ఇక రాశీ ఖన్నా రోల్ పూర్తి ఫన్ వేలో సాగితే.. రావు రమేష్ పాత్ర సర్ప్రైజింగ్ గా ఉండబోతోంది. మొత్తానికి అద్భుతంగా ఉన్న తాజా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను అందుకుని గోపీచంద్ హిట్ కొడతాడో..లేదో.. తెలియాలంటే జూలై 1వ తేదీ వరకు ఆగాల్సిందే.