Gopichand-Chiranjeevi: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ త్వరలోనే `పక్కా కమర్షియల్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా నటించగా.. సత్యరాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 బ్యానర్ల పై ఈ మూవీని అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. మరింత హైప్ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 26న హైదరాబాద్లో జరగనుంది. ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా రావాలని మేకర్స్ సంప్రదించగా.. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారట. `పక్కా కమర్షియల్` ప్రీ రిలీజ్ ఈవెంట్కు విచ్చేసి సినిమా హైప్ని చిరు మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు.
ఇది ఒకరకంగా గోపీచంద్కు సాయం చేసినట్లే అవుతుంది. కాగా, గత కొన్నేళ్ల నుంచీ సరైన హిట్ లేక సతమతం అవుతున్న గోపీచంద్.. `పక్కా కమర్షియల్` పక్కాగా విజయం సాధించాలని ఆశపడుతున్నారు. మరి ఆయన ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.