Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు” సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. మొగలుల సామ్రాజ్యం కాలం నాటి స్టోరీ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మిగతా షూటింగ్ చాలా స్పీడ్ గా కంప్లీట్ అయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేయటం జరిగింది అంట. ఈ క్రమంలో రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్స్ లో నిధి అగర్వాల్, ఇతర ప్రధాన తారాగనంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.
దాదాపు 20 రోజులపాటు షూటింగ్ జరగనుందట. సినిమాలో కీలకమైన సన్నివేశాలకు సంబంధించి జరుగుతున్న ఈ షూటింగ్ కి ముందే కొద్ది రోజులు వర్కింగ్ కూడా నిర్వహించడం జరిగిందంట. ఇప్పుడు ఏకంగా షూటింగ్ బరిలో దిగి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పాతకాలం నాటి యుద్ధ విద్యలు కూడా పవన్ నేర్చుకున్నారు. ఈ సినిమాలో ఫైట్స్ ఎక్కువగా ప్రాచీన కాలం నాటి యుద్ధ విద్యల తరహాలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “ఖుషి” నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒకపక్క రాజకీయంగా మరో పక్క సినిమా పరంగా రెండు రంగాలలో విజయవంతంగా పవన్ రాణిస్తూ ఉన్నారు. అయితే “హరిహర వీరమల్లు” కంప్లీట్ అయిన వెంటనే పూర్తిగా రాజకీయాలకు పవన్ పరిమితం కానున్నట్లు సమాచారం. 2024 ఎన్నికలకు జనసేన పార్టీని అన్ని రకాలుగా రెడీ చేయాలని పవన్ ప్లానింగ్. దీంతో ఈ సినిమాని కంప్లీట్ చేసిన వెంటనే ఫోకస్ మొత్తం రాజకీయాలపై పవన్ కళ్యాణ్ పేటనున్నట్టు వార్తలు వస్తున్నాయి.