Pawan Kalyan: ప్రస్తుతం టాలీవుడ్లో రీమేక్ చిత్రాల హవా కొనసాగుతోంది. స్టార్ హీరోలు సైతం రీమేక్పై మోజు పడుతున్నారు. ఈ లిస్ట్లో పవన్ కళ్యాణ్ ఒకరు. `వకీల్ సాబ్` వంటి రీమేక్ చిత్రంతో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత `భీమ్లా నాయక్`తో ప్రేక్షకులను పలకరించాడు. ఇదీ రీమేక్ మూవీ కావడం విశేషం.
ప్రస్తుతం పనవ్ చేతిలో ఉన్న రీమేక్ ప్రాజెక్ట్స్లో `వినోదాయ సీతాం` ఒకటి. సముద్రఖని నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రమిది. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడీ మూవీ తెలుగుతో రీమేక్ కాబోతోంది. ఇందులో పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించబోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలుగులోనూ సముద్రఖనినే డైరెక్ట్ చేయబోతున్నారు. మరణించిన ఓ వ్యక్తికి దేవుడు పునర్జన్మనిస్తాడు.మూడు నెలల పాటు జీవితాన్ని గడిపేందుకు అవకాశమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ చిత్రం. ఇందులో దేవుడిగా పవన్, పునర్జన్మను పొందే వ్యక్తిగా సాయి ధరమ్ తేజ్ కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఈ రీమేక్కు సంబంధించి ఓ టాక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
అదేంటంటే.. ఈ మూవీ తర్వాలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోందట. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అలాగే ఈ చిత్రాన్ని పవన్ కేవలం మూడు వారాల్లో ముగించబోతున్నాడని తెలుస్తుంది. అంటే ఆయన ఈ సినిమాకి కేవలం 20 రోజులు మాత్రమే కాల్షీట్స్ ఇచ్చారట. ఆ వ్యవధిలో ఆయన తన షూటింగ్ పార్ట్ను కంప్లీట్ చేయనున్నాడని, మరో నాలుగైదు నెలలు సాయి ధరమ్ తేజ్ తదితరులపై చిత్రీకరణ జరుగుతుందని అంటున్నారు.