పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే `హరి హర వీరమల్లు` షూటింగ్ పై దృష్టి సారించారు.
ఇదే కాకుండా ఆయన చేతిలో `భవదీయుడు భగత్ సింగ్`, `వినోదయ సీతం` రీమేక్ తదితర చిత్రాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇంకా పూర్తి కాకుండానే పవన్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ ఆ దర్శకుడు మరెవరో కాదు.. సుజీత్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఈయన `సాహో` అనే మూవీ చేశాడు.
ఈ చిత్రం ఫలితం గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అయితే ప్రభాస్కు బిగ్ ఫ్లాప్ ఇచ్చిన సుజీత్తో పవన్ రిస్క్ చేసి ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. గతంలో సుజీత్, పవన్ కాంబినేషన్ లో తమిళ సూపర్ హిట్ `తేరీ(తెలుగులో పోలీసుడు)` రీమేక్ తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి.
కానీ తరువాత ప్లాన్స్ మారాయని.. ఓ కొత్త కథను సుజీత పవన్కు వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చిందట. వెంటనే సినిమా చేసేందుకు ఓకే చెప్పేశారట. అక్టోబర్ 5న అంటే దసరా పండుగ నాడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని అధికారికంగా లాంఛ్ చేయబోతున్నారట. అలాగే నవంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సైతం సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!