Pawan Kalyan: రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్లను లైన్లో పెట్టి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన చేతిలో ఉన్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు` ఒకటి. పవన్ కెరీర్లో తెరకెక్కుతున్న తొలి పీరియాడికల్ చిత్రమిది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. రెండు కాలాల మధ్య ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. ఇకపోతే గత ఏడాదే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లగా.. కరోనా కారణంగా కొన్నాళ్లు .. పవన్ నిర్ణయాల కారణంగా కొన్నాళ్లు వీరమల్లు షూటింగ్ డిలే అవుతూ వచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇటీవలె హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ ను రీ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు యాబై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. మిగతా యాబై శాతం షూటింగ్ పూర్తి చేసుకోవల్సి ఉంది. అయితే ఇంతలోనే షూటింగ్కు మరోసారి బ్రేక్ పడనుందంటూ వార్తలు వచ్చాయి.
కానీ, పవన్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. పవన్ రాజకీయాల కారణంగా అక్టోబర్ నుంచి చాలా బిజీగా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఆగస్టు నెల ఆఖరిలోపు వీరమల్లు షూటింగ్ను పూర్తి చేయాలని కొత్త టార్గెట్ను పెట్టుకున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే ఇంత తక్కువ టైమ్లో యాబై శాతం షూటింగ్ను కంప్లీట్ చేయడం సాధ్యమేనా అన్నది హాట్ టాపిక్గా మారింది.