‘ఆర్ఎక్స్ 100’ తో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుని కుర్రకారు గుండెల్లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఈ భామకు వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, అవేమి ఆమె సక్సెస్ను అందించలేకపోయాయి.
స్టార్ హీరోల సంగతి అటుంచితే.. టైర్-2 హీరోలు సైతం ఇప్పుడు పాయల్ వైపు చూడటం మానేశారు. ఆఫర్లు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. రీసెంట్గా ఈ బ్యూటీ `తీస్ మార్ ఖాన్`తో ప్రేక్షకులను పలకరించింది. ఆది సాయి కుమార్ ఇందులో హీరోగా నటించారు. ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈ మూవీతో పాయల్ ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి పడింది. అందం ఉంది కానీ ఆఫర్లు నిల్ అన్నట్లు పాయల్ పరిస్థితి మారింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలన్నీ `జిన్నా` మీదే పెట్టుకుంది. మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది.
ఎవిఎ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం.. త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ మూవీతో అయినా పాయల్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో..లేదో..చూడాలి.