పాయల్ రాజ్పుత్.. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. పంజాబీ మూవీతో సినీ కెరీర్ను ప్రారంభించిన పాయల్.. `ఆర్ఎక్స్ 100` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న పాయల్.. బోల్డ్ బ్యూటీగా యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ను సంపాదించుకుంది.
ఆ తర్వాత పాయల్ వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, అవేమి ఆమెకు స్టార్ హోదాను అందించలేకపోయాయి. ఇక రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ `తీస్ మార్ ఖాన్`తో ప్రేక్షకులను పలకరించింది. ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు. ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్.. ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను అందరితోనూ షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే తాను హీరోయిన్ కాకపోయుంటే ఏం పని చేసేదాన్నో కూడా వివరించింది. తాను ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే తప్పకుండా న్యూస్ యాంకర్ గా మారేదాన్ని అని పాయల్ తెలియజేసింది.
జర్నలిజం లో ఈ ముద్దుగుమ్మ డిగ్రీ కూడా చేసిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా వైరల్గా మారాయి. కాగా, ప్రస్తుతం పాయల్ మంచు విష్ణుకు జోడీగా `జిన్నా` అనే మూవీలో నటిస్తోంది. ఇందులో సన్నీ లియోన్ కీలక పాత్రను పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!