టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో వరస ఫ్లాపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగింది. తనదైన టాలెంట్తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ లోనే కాదు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గడుపుతోంది.
ఇకపోతే పూజా హెగ్డే గత కొంత కాలం నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈమె నుంచి చివరి గా వచ్చిన `రాధేశ్యామ్`, `ఆచార్య`, `బీస్ట్` చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాయి. అయితే తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో పూజా హెగ్డే ముచ్చటించింది.
ఈ సందర్భంగా ఆమె హిట్లు ఫ్లాపుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `అదృష్టం కొద్దీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. నా ప్రతిభతో నిలదొక్కుకున్నాను. హిట్లు ఫ్లాపులు ఎప్పుడు తలుపుతడతాయో ఎవరూ చెప్పలేరు. హిట్ పక్కా అనుకున్న సినిమా ఫ్లాప్ కావొచ్చు. ఎలాంటి బజ్ లేని సినిమా బ్లాక్ బస్టర్ కావొచ్చు. అయితే సినిమా హిట్టయితేనే జనం మన గురించి మాట్లాడుకుంటారు. లేదంటే ఎవరూ పట్టించుకోరు.
కనీసం స్నేహితుల నుంచి కూడా ఫోన్లు రావు. అందరికీ ఇలాగే జరుగుతుంది. ఈ విషయంలో నేనేమీ మినహాయింపు కాదు. ఇక్కడ హిట్టుకే విలువెక్కువ. అందుకే నా సినిమా రిలీజ్ అంటే కాస్త కంగారుపడుతుంటాను.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త వైరల్గా మారాయి. కాగా, ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న `ఎస్ఎస్ఎమ్బీ 28`లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతో పాటు బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్లను సైతం పూజా హెగ్డే టేకప్ చేసింది.
https://newsorbit.com/cinema/a-terrible-insult-to-pooja-hegde.html