Pooja Hegde: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ఇప్పటికే `మహర్షి` మూవీలో నటించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మరోసారి మహేశ్తో పూజా హెగ్డే జత కట్టబోతోంది. ఇటీవల `సర్కారు వారి పాట`తో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్న మహేశ్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో అనౌన్స్ చేశాడు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపిక అయింది. ఫిబ్రవరిలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా.. మరికొద్ది రోజుల్లోనే సెట్స్ మీదుకు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుందని ప్రచారం జరిగినా.. అధికారిక ప్రకటన రావడంతో అది నిజం కాదని తేలిపోయింది. అయితే మహేశ్ మూవీలో నటించేందుకు పూజా హెగ్డే కండీషన్స్ పెట్టిందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. అవేంటంటే.. ఈ సినిమా కోసం కేవలం 45 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తుందట. అంతకు మించి ఒక్క రోజు కూడా ఇవ్వనందట. ఆ 45 రోజుల్లోనే తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ను పూర్తి చేయాలట.
రెమ్యునరేషన్ కింద రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందట. అలాగే షూటింగ్ సమయంలో తనతో పాటు తన స్టాఫ్ కి అయ్యే ఖర్చులను నిర్మాణ సంస్థ భరించాలని మరియు తన స్టాఫ్కు సాలరీ సైతం చెల్లించాలని కండీషన్ పెట్టిందట. వాటన్నిటికీ మేకర్స్ ఒప్పుకున్నాకే పూజా హెగ్డే మహేశ్ మూవీకి సైన్ చేసిందని టాక్ నడుస్తోంది.