Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తరచూ షూటింగ్స్ నిమిత్తం హైదరాబాద్ టు ముంబై, ముంబై టు హైదరాబాద్ వెళ్తుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కూడా ఈ బ్యూటీ తన సన్నిహితులతో కలిసి ముంబై నుండి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ లో జర్నీ చేసింంది. అయితే ఈ జర్నీలో ఆమె ఓ చేదు అనుభవం ఎదురైంది.
ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఓ ఉద్యోగి తమ పట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ పూజా ఆవేదన వ్యక్తం చేసింది. `ఇండిగో 6ఈ ఉద్యోగి ఎంత రూడ్ గా ఉన్నాడో.. ముంబై నుండి బయలుదేరిన మా విమానంలో విపుల్ నకాషే అనే సిబ్బంది ఈరోజు మాతో ప్రవర్తించిన తీరుకు చాలా బాధ పడుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఎటువంటి కారణం లేకుండా మాతో పూర్తిగా అహంకారం, అజ్ఞానం మరియు బెదిరింపు స్వరంతో విరుచుకుపడ్డాడు. సాధారణంగా ఈ తరహా ఘటనలను తాను బయటకు చెప్పను, కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది.` అంటూ ట్వీట్ చేసింది. ఇండిగో ఎయిర్ లైన్ సంస్థ ను ట్యాగ్ కూడా చేసింది. దీంతో పూజా హెగ్డే ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది.
ఆమె అభిమానులు సదరు ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఇండిగో సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా, పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె తెలుగులో విజయ్ దేవరకొండకు జోడీగా `జనగణమన`, మహేశ్ బాబు సరసన `ఎస్ఎస్ఎమ్బీ 28` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే హిందీలో పలు ప్రాజెక్ట్స్కు ఈ బ్యూటీ సైన్ చేసింది.
Extremely sad with how rude @IndiGo6E staff member, by the name of Vipul Nakashe behaved with us today on our flight out from Mumbai.Absolutely arrogant, ignorant and threatening tone used with us for no reason.Normally I don’t tweet abt these issues, but this was truly appalling
— Pooja Hegde (@hegdepooja) June 9, 2022