సినీ ఇండస్ట్రీలో తారలు సర్జరీలు చేయించుకోవడం సర్వసాధారణం. అయితే ఈ విషయంపై కొందరు తారలు నేరుగా స్పందిస్తారు.. మరి కొందరు స్పందించరు. కానీ ఈ విషయంపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా టాలీవుడ్ కు చెందిన మరో హీరోయిన్ కూడా అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీ కి రెడీ అవుతోందట.
ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ బ్యూటీ త్వరలోనే తన ముక్కుకు సర్జరీ చేయించుకోబోతోందట. ముఖం చూడచక్కగా ఉన్నా ముక్కు మాత్రం సరిగా లేదని, అదే ఆమె ముఖంలో ఉన్న మైనస్ అని ఆమెతో ఇటీవల కొందరు డైరెక్టుగానే చెప్పారట.
ఈ నేపథ్యంలోనే ఆమె తన ముక్కును అందంగా మార్చుకోవడానికి సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. చివరగా ఈమె `ఆచార్య`, `రాధేశ్యామ్`, `బీస్ట్` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.
అనూహ్యంగా ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు కు జోడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్, కోలీవుడ్ లో సైతం పలు ప్రాజెక్టులను టేకప్ చేసింది.