టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి పరిచయాలు అవసరం లేదు. సౌత్తో పాటు నార్త్లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతున్న పూజా హెగ్డేకు ఈ ఏడాది ఆరంభం నుండీ షాకులే తగులుతున్నాయి. ఈమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తో పడుతున్నాయి. ఈమె నుండి చివరిగా `రాధేశ్యామ్`, `బీస్ట్`, `ఆచార్య` చిత్రాలు వచ్చాయి.
ఇవేమి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయినప్పటికీ పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పూజా హెగ్డే షూటింగ్కి నెల రోజులు బ్రేక్ ఇచ్చి వెకేషన్కు చెక్కేసింది. టూర్ కి వెళ్తోన్న ఫొటోను షేర్ చేస్తూ..`నెల రోజులు.. మూడు ఖండాలు.. నాలుగు నగరాలు.. ఛలో` అంటూ రాసుకొచ్చింది.
ఇక ఇంతకీ బుట్టబొమ్మ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.. బ్యాంకాక్ లో. అవును, పూజా హెగ్డే బ్యాంకాక్ తో తన టూర్ను స్టార్ట్ చేసింది. అక్కడ కొద్ది రోజులు ఎంజాయ్ చేసి.. ఆపై తన టూర్ ని కంటిన్యూ చేయబోతోంది. కాగా, పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈమె టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు జోడీగా `ఎస్ఎస్ఎమ్బీ 28`లో నటిస్తోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన `కభీ ఈద్ కభీ దివాళి`, రణవీర్ సింగ్కు జోడీగా `సర్కస్` సినిమాలు చేస్తుంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం పూజా హెగ్డే చేతిలో ఉన్నాయి.