టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే షూటింగ్లో గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఆమె నడవలేని స్థితిలో ఉంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే.. తాజాగా తన కాలి మడమకు పట్టీ కట్టి ఉన్న పిక్ ను ఇన్స్టాగ్రామ స్టోరీ ద్వారా షేర్ చేసింది.
` లిగ్మెంట్ టియర్` అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. గత కొద్ది రోజుల నుంచి పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ `కిసి కా భాయ్ కిసి కి జాన్` షూటింగ్లో పాల్గొంటుంది. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తుంటే.. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లోనే పూజ హెగ్డే గాయపడిడినట్లు ప్రచారం జరుగుతోంది.
మరి పూజా హెగ్డే ఈ సినిమా షూటింగ్ సెట్ లో గాయపడిందా.. ? లేక మరెక్కడైనా ప్రమాదం జరిగిందా.. ? అనేది తెలియాల్సింది ఉంది. ఇక ప్రస్తుతం ఇంటికే పరిమితం అయిన పూజా హెగ్డే త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కాగా, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ `ఎస్ఎస్ఎమ్బీ 28`లో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తీయబోయే `జనగణమన`లోనూ హీరోయిన్ గా ఎంపిక అయింది.