పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు పెద్ద చిత్రాలు ఉన్నాయి. అందులో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని . సిరీస్ బ్యానర్పై భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ కలిసి దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తే.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, హేమా మాలిని, సన్నీ సింగ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీతో సహా మొతతం 15 భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. `ఆదిపురుష్` ఓవర్సీస్ హక్కులను నిర్మాతలు భారీ ధరకు అమ్ముతున్నారట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను రూ. 38 కోట్ల రూపాయలకు విక్రయించాలని నిర్మాతలు భావిస్తున్నారట.
ఇప్పటి వరకు `ఆదిపురుష్` నుండి సరైన అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు. కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ ను కూడా బయటకు వదల్లేదు. అయినా సరే మేకర్స్ ఓవర్సీస్ హక్కులను అంత భారీ మొత్తంలో విక్రయించాలని భావిస్తున్నారంటే.. సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ తో ప్రభాస్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడటం గ్యారంటీ అని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.