పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా అలరించబోతున్నారు.
అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. టి. సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3డీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఇందులో భాగంగా మేకర్స్ ప్రచార కార్యక్రమాలను సైతం షురూ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. `ఆదిపురుష్`కు మేకర్స్ షాకింగ్ రన్ టైమ్ను లాక్ చేశారట. ఇంతకీ ఎంతో తెలుసా..? 3 గంటల 15 నిమిషాలు అట.
ఫైనల్ కట్ లో ఈ సినిమాకు 3 గంటల 15 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంత లెంగ్త్ అంటే మామూలు విషయం కాదు. ఇంత సమయం ప్రేక్షకులను థియేటర్ లో ఆపాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉండాలి. ఎలాంటి బోరింగ్ సన్నివేశాలు ఉండకుండా జాగ్రత్త పడాలి. మరి ప్రభాస్ అన్ని గంటలు ప్రేక్షకులను థియేటర్స్ లో ఆపగలడా..? లేదా..? అన్నది చూడాలి.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!