పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అదే ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, హేమ మాలిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా మేకర్స్ పై ప్రభాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
షూటింగ్ పూర్తైపోయినా.. ఇప్పటివరకు కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా బయటకు వదల్లేదు. ఇంకా విడుదలకు కొన్ని నెలలే ఉన్నా.. మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆదిపురుష్ చిత్ర టీం పై గత కొద్ది రోజుల నుంచీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
అయితే రీసెంట్ గా ఈ సినిమా టీజర్ తో పాటు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం.. దసరాకి ఈ సినిమా అప్డేట్స్ రావడం కష్టమే అట. ఈసారి కూడా అభిమానులకు నిరాశే అని అంటున్నారు.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!