`బాహుబలి` తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వందల కోట్ల బడ్జెట్, వేల కోట్ల బిజినెస్ అన్నట్టుగా ఆయన సినిమాలు ఉంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఆయన టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు గత కొద్ది రోజుల నుండీ జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని మారుతి కూడా కన్ఫార్మ్ చేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. అయితే తాజాగా వీరిద్దరి సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రభాస్-మారుతి సినిమాను రేపు పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంఛ్ చేయడబోతున్నారట.
ఇందుకు సంబంధించిన అన్నీ ఏర్పట్లు కూడా పూర్తి అయ్యాయని టాక్ నడుతుస్తోంది. ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. మారుతితో ప్రభాస్ సినిమా స్టార్ట్ అవ్వకూడదంటూ అభిమానులు కోరుకుంటారు. అందుకు కారణం లేకపోలేదు.. మారుతికి గత కొంత కాలం నుంచి సరైన హిట్ పడలేదు.
ఆయన చివరిగా తెరకెక్కించిన `పక్కా కమర్షియల్` బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. పైగా మారుతికి స్టార్ హీరోలను డీల్ చేసిన అనుభవం కూడా లేదు. ఈ నేపథ్యంలోనే మారుతితో సినిమా వద్దంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆకాక్షిస్తున్నారు. దీంతో వీరి రియాక్షన్ కాస్త వైరల్గా మారింది.