ఇటీవల టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్డే వస్తోందంటే చాలు.. వారి కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ థియేటర్ల వద్ద నెక్స్ట్ లెవల్లో సందడి చేస్తున్నారు. అయితే ఈ నెల 23న ప్రభాస్ బర్త్డే జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన పలు సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన `బిల్లా` రీ రిలీజ్కు సిద్ధమైంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయగా.. అనుష్క హీరోయిన్గా నటించింది. ప్రభాస్, ఆయన పెదనాన్న కృష్ణంరాజు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమిది. ఇందులో నమిత, హన్సిక, జయసుధ తదితరులు కీలక పాత్రలను పోషించగా.. మణిశర్మ సంగీతం అందించాడు.
గోపీకృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం 3 ఏప్రిల్ 2009న విడుదలైంది. అయితే ఈ స్టైలిష్ యాక్షన్ మూవీ కమర్షియల్గా హిట్ అవ్వకపోయినా.. అభిమానులను మాత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న బిల్లా రీ రిలీజ్ చేయబోతున్నారు. 4కే ప్రింట్ కూడా సిద్ధమైంది.
ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. అయితే `బిల్లా` రీ రిలీజ్ ద్వారా వచ్చే వసూళ్లను ఏం చేయబోతున్నారో తెలుసా..? యూకే ఇండియా డయోబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కు విరాళంగా ఇవ్వబోతున్నారట. కృష్ణంరాజు గారు ఈ ఫౌండేషన్ లో భాగస్వామిగా ఉన్నారట. ఈ నేపథ్యంలోనే ఆ ఫౌండేషన్ కు `బిల్లా` రీ రిలీజ్ ద్వారా వచ్చే వసూళ్లను విరాళంగా ఇవ్వబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!