Adipurush Director: పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ టేక్ప్ చేసిన ప్రాజెక్ట్స్లో ఒకటే `ఆదిపురుష్`. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. టీ సిరీస్ బ్యానర్పై భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే లంకేశుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ చేస్తున్నారు. సాచేత్ తాండన్- పరంపరా ఠాకూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2023 జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్, వీఎఫ్ ఎక్స్ పనులు జరుగుతున్నాయి. అయితే షూటింగ్ ఎప్పుడో పూర్తైనా.. ఈ మూవీ నుంచి ఏ ఒక్క అప్డేట్ కూడా బయటకు రావడం లేదు. కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదలకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆదిపురుష్ టీమ్గా గత కొద్ది రోజుల నుంచీ మండిపడుతున్నారు.
ఇలాంటి తరుణంలో డైరెక్టర్ ఓం రౌత్ ఓ ఫొటోను షేర్ అడ్డంగా ఇరుకున్నాడు. అసలేమైందంటే.. నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓం రౌత్ యోగాశనాలు వేస్తూ ఓ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇప్పుడీ ఫొటోనే ఫ్యాన్స్ను ఆగ్రహానికి గురి చేసింది. ఆదిపురుష్ కు సంభందించిన అప్ డేట్స్ ఇవ్వటానికి టైమ్ లేదు. కానీ యోగా డే రోజున మాత్రం నీ ఫొటోను షేర్ చేస్తావా అంటూ రకరకాలుగా ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఓం రౌత్ అప్డేట్ ఇస్తాడో లేదో చూడాలి.
Let your soul feel the breath!#InternationalYogaDay pic.twitter.com/xoJlORLL0h
— Om Raut (@omraut) June 21, 2022