Prabhas: పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని టి. సిరీస్ బ్యానర్పై భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది.
ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్, హేమా మాలిని తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండగ కానుకగా భారీ లెవల్లో విడుదల కానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఓ ఎపిసోడ్ను చిత్రీకరించారు. తండ్రి జనకమహారాజుతో సీతకి ఉండే అనుబంధాన్ని ఈ ఎపిసోడ్లో చూపించబోతున్నారట. అయితే సీత పాత్రకి కృతి ఎలాగో ఉంది కానుక.. జనకమహారాజు పాత్ర కోసం ఓం రౌత్ అనేక మందిని సెర్చ్ చేసి ఫైనల్గా ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్టంరాజును సెలెక్ట్ చేసుకున్నారు.
ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని, మిథిలాధిపతి జనకుడిగా మన రెబల్ స్టార్ కృష్ణంరాజు కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు.. ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. రెబల్, రాధేశ్యామ్ చిత్రాలే ఉదాహరణ. అందుకే ఆదిపురుష్ విషయంలో డార్లింగ్ ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!